ELR: రాష్ట్రంలో జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు బీజేపీకి బానిసలుగా, బినామీలుగా మారారు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. చింతలపూడి మండలం ఎర్రంపల్లిలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. వీళ్లల్లో ఒక్క నాయకుడు కూడా ప్రత్యేక హోదా కావాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, అమరావతిని నిర్మించాలని కోరలేదని ఎద్దేవ చేశారు.