RR: భూ భారతి భూ సర్వే కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల మండలంలోని నవలయపల్లి, అంతారం గ్రామాలను మోడల్ గ్రామాలుగా ఎంపిక చేసినట్లు తహసీల్దార్ కృష్ణయ్య తెలిపారు. నవలయపల్లిలో గ్రామసభ నిర్వహించి భూముల సరిహద్దులు, యాజమాన్య వివరాలను సర్వే చేసి డిజిటల్ రికార్డులుగా నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామస్వామి, ఆర్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు.