MBNR: కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు తండాలో ఇండిపెండెంట్ సర్పంచ్ పద్మావత్ లక్ష్మీనారాయణ నాయక్, ఉప సర్పంచ్ కిషన్ నాయక్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి సాదరంగా కండువాలు కప్పి ఆహ్వానించారు.