NRML: బాసర అమ్మవారి ఆలయంలో 83 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ EO వివరాలు తెలుపగా రూ.81,69,099 నగదు ఆదాయం వచ్చినట్లు, మిశ్రమ బంగారం 91.500 గ్రా, మిశ్రమ వెండి 3.500గ్రా, విదేశీ కరెన్సీ 79 నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, సేవ సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.