SRPT: మోతే మండలంలోని పలు గ్రామాలకు చెందిన పేద ప్రజలు ఉపాధి లేక వలస బాట పడుతున్నారు. గ్రామాల్లో పని అవకాశాలు కరువు అవడంతో ఆంధ్రప్రదేశ్లోని గండ్లపాడు ప్రాంతానికి మిర్చి కోతలకు వెళుతున్నారు. ముఖ్యంగా 60-70 ఏళ్ల వృద్ధులు సైతం కూలి పనుల కోసం తరలిపోతున్నారు. గ్రామాల్లోనే ఉపాధి హామీ పనులు కల్పించి, వలసలను అరికట్టాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.