NZB: రూరల్ MLA డా.భూపతి రెడ్డిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, వర్ధన్నపేట్ MLA నాగరాజు ఆదివారం సాయంత్రం పరామర్శించారు. ఇటీవల MLA భూపతి రెడ్డి మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నర్సమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. నగర శివారులోని బైపాస్ ప్రాంతంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే నాగరాజు ఆయన్ను పరామర్శించారు.