అన్నమయ్య: కె.వి పల్లి మండలం, వడ్లకుంట పంచాయతీ సుబ్బాలవారి పల్లిలో పొలం గొడవలో పూజారి నాగులపై, మల్లెల జయన్న (63), భార్య సుబ్బమ్మ (55) కొడవలితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను పీలేరు అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ విషయం కె.వి పల్లి ఎస్సై బి. వెంకట శివకుమార్ తెలిపారు.