AP: విజయవాడలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. దుండగుడు వారిపై కాల్పులకు ప్రయత్నించాడు. అయితే ట్రిగర్ లాక్ కావడంతో.. బుల్లెట్ బయటకు రాలేదు. అప్రమత్తమై దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 9ఎంఎం పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.