SKLM: టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తన కార్యాలయంలో ఆదివారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం నుంచి ప్రజలు వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైన్లు, సాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.