MDK: చేగుంట మండలం వడియారం గ్రామంలోని ఏపీఎల్ అపోలో టైర్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ఆరవ రోజు ఆదివారం సమ్మె కొనసాగించారు. ముగ్గురు కార్మికులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడంతో అక్రమంగా బదిలీ చేశారని 69 మంది కార్మికులు బీఎంఎస్ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్నారు. బదిలీ నిలిపే వరకు సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు.