GDWL: ఉండవెల్లిలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చిన్న రాముడు, పెద్ద రాముడు, నాగమద్దిలేటి, శ్రీరాములు అనే రైతులకు చెందిన 5 గడ్డివాములు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.