NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టికోట గ్రామంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెట్టికోట గ్రామం వద్ద స్కార్పియో వాహనం రాముడు అనే వ్యక్తిని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని కుమారుడు నాగపుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.