KRNL: మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో ఎద్దుల బండి ప్రమాదంలో బాలుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాజా అనే రైతు ఎద్దుల బండితో పొలం పనులకు వెళ్తుండగా ఎద్దులు అకస్మాత్తుగా బెదిరి, అదే గ్రామానికి చెందిన బీరప్ప అనే బాలుడిపై దాడి చేశాయి. గాయాలతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు.