అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎన్సీసీ విభాగం డా.బి.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం “ఎన్సీసీ అవగాహన కార్యక్రమం” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఎన్సీసీ ఎంపిక విధానం, శిక్షణా ప్రక్రియ, సర్టిఫికెట్లు, భవిష్యత్తు అవకాశాలు గురించి విపులంగా శుక్రవారం వివరించారు. అనంతరం విద్యార్థులు క్రమశిక్షణ, దేశసేవ భావనలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.