ATP: పీఏబీఆర్ నుంచి నగరానికి నీటి సరఫరా చేసే పైపులైన్ పగిలి నీరు లీకేజీ అవుతోంది. దీంతో శుక్రవారం నగరంలో నీటిసరఫరాకు అంతరాయం ఏర్పడనుందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని అనంత నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి తెలిపారు.పీఏబీఆర్ నుంచి నగరానికి నీటిని సరఫరా చేసే పైపులైన్ కొడిమి సమీపంలోని సిప్లాన్ కెమికల్ ఫ్యాక్టరీ సర్కిల్లో లీకేజీ అవుతోందన్నారు.