SRD: పత్తి రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందాలంటే మొబైల్లో కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఖేడ్ ADA నూతన్ కుమార్ బుధవారం తెలిపారు. ప్రతి రైతు ఈ యాప్లో రైతు వివరాలు, ఏయే పంటలు వేశారో నమోదు చేయాలన్నారు. పత్తి అమ్మే సమయంలో ఈ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే, ప్రభుత్వ మద్దతు ధర వర్తిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.