SRD: ఓ హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా జడ్జి భవాని చంద్ర మంగళవారం తీర్పు ఇచ్చారు. సదాశివపేటలో నివాసం ఉంటున్న బీరప్ప 05-08-2021 రోజున నిద్రమత్తులో ఉన్న పాపయ్య అనే వ్యక్తిని బండరాయితో కొట్టి చంపాడు. నేరం రుజువు కావడంతో బీరప్పకు జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ పరతోష్ పంకజ్ తెలిపారు.