WNP: అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని MLA మేఘారెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశాలలో ఎమ్మెల్యే పాల్గొని పలు అంశాలను ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. అటవీ శాఖలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పైన, వైద్య సదుపాయాల పైన దృష్టి సారించాలన్నారు.