ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక నాగులవరం రోడ్డులో ఎస్సై నరసింహారావు ఇవాళ మద్యం సేవించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరసింహరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.