ATP: పుట్లూరు మండలం కొండుగారి కుంట గ్రామంలో ఇవాళ దారుణం చోటు చేసుకుంది. విషపు ఆహారం తిని 20 మేకలు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని అస్వస్థతకు గురయ్యాయి. గ్రామ శివారులో మేతమేస్తున్న సమయంలో ఈ దారుణం నేలకొంది. విషపు ఆహారం తినడం వల్లే మేకలు మృతి చెందినట్లు మేకల కాపరి ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని, తమను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.