MNCL: జిల్లాలో భూగర్భ జలాల పరిమితి పెరిగిందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం 43,545 ఇంకుడు గుంతలు, 5,372 సామాజిక ఇంకుడు గుంతలు జాతీయ ఉపాధి హామీ నిధుల ద్వారా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేసి వాటి సంరక్షించేలా చర్యలు తీసుకున్నామని గత మూడేళ్లలో 45 లక్షల మొక్కలు నాటామన్నారు.