ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను రానున్న డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కనిగిరి సుందరయ్య భవన్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 1000 వరకు ఖాళీలు ఉన్నప్పటికీ గతంలో కేవలం 120 ఎస్జీటీ పోస్టులు మాత్రమే విడుదల చేశారని విమర్శించారు.