KDP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో 28 మంది మృతికి బాధ్యత వహిస్తూ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజీనామా చేయాలని AITUC డిమాండ్ చేసింది.బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కడప AITUC నాయకుడు కేసీ బాదుల్లా కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని వారు మండిపడ్డారు.