NLR: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఇవాళ ఉదయం వీఐపీ విరామం సమయంలో మంత్రి పొంగూరు నారాయణ దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు మంత్రికి వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి నారాయణకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.