ఎన్టీఆర్: మైలవరం పట్టణం పరిధిలోని దేవుని చెరువులో శుక్రవారం 11వ సీసీ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు, కూటమి నాయకులతో కలిసి తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ ఈ పనులను పరిశీలించారు. కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కాళ్ళుగా పరుగులు పెడుతుందని ఆయన అన్నారు.