మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, కిషోర్ పాల్గొన్నారు.