NLG: కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ అమ్మవారు శుక్రవారం భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.