ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని మాచవరం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి చెందాడు. మృతుడు పిడుగురాళ్లకు చెందిన సాతులూరి రాంబాబు (45)గా స్థానికులు గుర్తించారు. ఈయన గత కొంతకాలంగా పచ్చాకు కూలీగా పనిచేస్తున్నాడు. స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు చేరుకొని మృతదేహాన ప్రభుత్వ వైద్యశాలను తరలించారు.