KMM: వైరా వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మార్కెట్ నూతన ఛైర్మన్ బోళ్ళ గంగారావు అన్నారు. ఆదివారం వైరాలో గంగారావు మార్కెట్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఛైర్మన్ను డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ సన్మానించారు.