KKD: శంఖవరం మండలం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో స్వామి అమ్మవార్ల రథసేవ ఆదివారం ఘనంగా జరిగింది. భక్తులు స్వయంగా వారి చేతులతో ఈ రథాన్ని లాగి స్వామివారి సేవలో కొనియాడారు. వీకెండ్ కావడంతో రత్నగిరి క్షేత్రానికి వచ్చిన భక్తులంతా ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు.