SRD: నారాయణఖేడ్ పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంపీ సురేష్ షెట్కార్ ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇరాక్ పల్లికి చెందిన శివాజీకి రూ.30 వేలు, షెల్గిరాకు చెందిన లక్ష్మికి రూ.16,000, తరుణ్ రెడ్డికి రూ.8000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ..పేద ప్రజల వైద్యం కోసం ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ పేరుమీద సహాయం అందిస్తుందని చెప్పారు.