AKP: కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అన్యాయాలపై ప్రజల తరపున గొంతెత్తాలని అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. అధికారంలో లేనప్పుడు ప్రజల తరుపున పోరాడుతున్నామో లేదో ప్రజలు గమనిస్తారని అన్నారు.