BDK: అశ్వాపురం జామా మసీదులో బుధవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీక అయిన ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఖురాను అవతరించిన శుభ సందర్భంగా ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రంగా భక్తిశ్రద్ధలతో చేపడతారని తెలిపారు.