E.G: గృహ నిర్మాణ పనుల్లో క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పనులు మరింత వేగవంతం చేయాలని రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. గురువారం కార్యాలయంలో వెలుగుబంద, కానవరం, నిడిగట్ల లేఅవుట్లలో నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా అధికారులు, గుత్తేదార్లు గృహాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.