SRPT: ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సామాన్యుడిలా జీవించే నిబద్ధత గల నాయకుడు, ‘ఆదివాసి ముద్దుబిడ్డ’ గుమ్మడి నర్సయ్య గురువారం మఠంపల్లిలో సందడి చేశారు. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆయన, స్థానిక టీ స్టాల్ వద్ద సాదాసీదాగా టీ తాగుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన నిరాడంబరతను చూసి ముగ్ధులైన స్థానికులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆయనతో ఫోటోలు దిగి ముచ్చటించారు.