కడప: YCP నుంచి TDPలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల ముగ్గురు కార్పొరేటర్లు TDPలో చేరగా తాజాగా మరో కార్పొరేటర్ చేరారు. కడప MLA మాధవి రెడ్డి,TDP పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో 5వ డివిజన్ కార్పొరేటర్ బండి జయమ్మతోపాటు, డివిజన్ ఇంఛార్జ్ బండి ప్రసాద్ పార్టీ మారారు. CM చంద్రబాబు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.