SKLM: సోంపేటలోని కొంచాడ రాజేశ్వరరావు డిగ్రీ కళాశాలలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి ఉరిటి సాయికుమార్ వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 300 మందికి పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు.