ADB: ఉట్నూర్ మండలంలోని యెంధా గ్రామంలో పోలీసులు గురువారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉట్నూర్, ఇందరవెల్లి, నార్నూర్ ఎస్సైలు, 18 మంది సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 10 లీటర్ల గుడుంబా, నంబర్ ప్లేట్లు లేని 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.