AKP: ఎస్ రాయవరం మండలంలో ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తెలిపారు. గురువారం లింగరాజుపాలెం, తిమ్మాపురం, దార్లపూడి తదితర పంచాయతీల్లో ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూలు చేసి రసీదులు అందజేశామన్నారు. ఈనెల 15వ తేదీ నాటికి శత శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.