ఖమ్మం జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి పొంగులేటి ఏదులాపురం మున్సిపాలిటీ ముత్తగూడెంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారని అనంతరం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపింది.