పార్వతీపురం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను జిల్లా సంయుక్త కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని, మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.