KRNL: హోళగుంద మండలం గజ్జెహళ్లి గ్రామంలోని బీసీ కాలనీలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. రహదారి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల విన్నపం మేరకు సుమారు రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు ఇవాళ మంజూరయ్యాయి. ఈ పనులు ప్రారంభం కావడంతో దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించిందని గ్రామస్థులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.