AP: 14వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. ఈరోజు అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జేఎన్టీయూ సవరణ బిల్లును మంత్రి లోకేష్, మోటారు వాహనాల పన్ను విధింపు బిల్లును మంత్రి రాంప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు.