ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో వెలసి ఉన్న పుణ్యక్షేత్రమైన నారాయణస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి పొంగళ్ళు నైవేద్యంగా పెట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ ఈవో గిరిరాజు నరసింహ బాబు భక్తులకు వసతులను సమకూర్చారు.