అన్నమయ్య: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష పట్టణంలో అభివృద్ధి పనులకు ఇవాళ భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందన్నారు. అలాగే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రమీల, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.