TG: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పిక్సియమ్ సంస్థ సిద్ధమైంది. LED మానుఫ్యాక్షురింగ్ రంగంలో పిక్సియమ్ డిస్ ప్లే టెక్నాలజీస్ LEDలు, మైక్రో LEDలు, ఆడియో కాంపోనెంట్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో రూ.200-250 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 100 మందికి పైగా ప్రత్యక్షంగా, దాదాపు 5 వేల మందికి పైగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఉండనున్నాయి.