PLD: నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో ఆర్డీఎస్ఎస్ (RDSS) పథకం కింద విద్యుత్ లైన్లను సింగిల్ ఫేజ్ నుంచి త్రీ ఫేజ్గా మార్చే పనులు చేపట్టారు. పాత పోల్స్, కండక్టర్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు ఏఈ సుచరిత తెలిపారు. ఈ పనుల వల్ల నేటి నుంచి 20 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.