BDK: జిల్లాలో మార్చి 6 నుంచి 16 వరకు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. బుధవారం అధికారులతో సమీక్షలో మాట్లాడారు. గ్రామం, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పిచ్చి మొక్కలను తొలగించి, తడి-పొడి చెత్తను వేరుగా సేకరించాలని అన్నారు.