కోనసీమ: ఈ నెల 7వ తేదీన ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికై సీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అమలాపురం ఈఈ రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సదస్సు జరుగుతుందన్నారు. విద్యుత్ సమస్యలు, ఫిర్యాదులు, బిల్లులు, కరెంట్ సరఫరా సమస్యలపై అభ్యంతరాలు తెలపవచ్చన్నారు.