NGKL: బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో విషాదం నెలకొంది. చింతకాయల లక్ష్మణ్(26) అనే యువకుడు డిండిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మూడేళ్లుగా అక్కడి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న లక్ష్మణ్, మంగళవారం రాత్రి బంకు నుంచి భోజనానికి కూరలు తెచ్చుకునేందుకు వెళ్లిన క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.